ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించి మోసం చేసిన శివాజీ.. ఎవరంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన స్టార్ హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఆయన హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టారో .. ఇక అప్పటినుంచి ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోని శివాజీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం.. శివాజీ గతంలో ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడి ఆమెను మోసం చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. లయోలా కాలేజ్ అనే సినిమాతో హీరోయిన్ లయ, శివాజీ ఇద్దరు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా నిలదొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, స్వరాభిషేకం , మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలలో వరుసగా శివాజీ , లయ నటించేసరికి వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో చాలా రోజులపాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు కూడా..

అయితే అదే సమయంలో వీరి గురించి ప్రేమ వార్తలు వచ్చినా.. ఎక్కడ కూడా వీరు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మీరాజాస్మిన్ తో శివాజీ లయ కలసి మిస్సమ్మ సినిమా చేశారు. అయితే అప్పటి నుంచి లయ ను వదిలేసి.. శివాజీ మీరాజాస్మిన్ వలలో పడ్డారని ఇండస్ట్రీలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇక అందరూ అనుకున్నట్టుగానే లయ ను వదిలేసి శివాజీ మీరాజాస్మిన్ తో తిరిగేవారు. ఇక తర్వాత మీరాజాస్మిన్ కారణంగానే లయ, శివాజీ ల మధ్య బ్రేకప్ పెరిగి దూరమయ్యారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news