చంద్రబాబుపై ఆరోపణలు నిరూపిస్తే..పీక కోసుకుంటా – అచ్చెన్నాయుడు

-

చంద్రబాబుపై ఆరోపణలు నిరూపిస్తే..రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు అచ్చెన్నాయుడు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ కాక్ష తప్ప.. చట్టం,ధర్మం లేదన్నారు. నిన్నటితో పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. స్కిల్ కేసులో ఇరికించి చంద్రబాబు ను దారుణాతి దారుణంగా సీఐడీ కస్టడీలోకి తీసుకుంది… చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ ఆగ్రహించారు.

2015-16లో జీవో ఇచ్చి కేబినెట్లో చర్చించి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను అసెంబ్లీ ఆమోదించింది….స్కిల్ డవలప్ మెంట్ ప్రాజెక్ట్ వల్ల ఎందరో శిక్షణ పొందారని సీఐడీనే చెప్పిందన్నారు. స్కిల్ అక్రమాలు కేసు ఊహాజనితమైన అంశాలపై ఆధారపడి పెట్టినవే అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు కు కానీ నాకు కానీ మా కుటుంబాలకు కానీ పైసా లబ్ది చేకూరినట్టు నిరూపించినా “పీక కోసుకుంటాను” అంటూ సవాల్‌ చేశారు. చంద్రబాబు ను విచారణ పేరుతో రెండు రోజులు నిద్ర కూడా లేకుండా ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news