షారుక్‌కు బెదిరింపులు.. Y+ భద్రత కల్పించిన మహా సర్కార్

-

బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్​కు ఇటీవల బెదిరింపులు ఎక్కువయ్యాయి. షారుక్​ను చంపేస్తామంటూ ముంబయిలోని ఆయన నివాసం మన్నత్‌కు పలు లేఖలు వచ్చాయి. షారుక్‌ ముంబయి పోలీసులను ఆశ్రయించి.. తనకు వస్తోన్న బెదిరింపు కాల్స్‌ దృష్ట్యా మరింత భద్రత కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. బాలీవుడ్ బాద్​షాకు కల్పించిన భద్రతను మరింత పెంచుతూ.. దాన్ని వై-ప్లస్‌ కేటగిరీగా మార్చింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ ప్రకటన జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించగా.. వారు మూడు షిఫ్టుల్లో ఆయనకు భద్రత కల్పించనున్నారు. మరోవైపు కొందరు వ్యక్తులు షారుక్‌ ఫొటోలను ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు షారుక్ ఈ ఏడాది ఫుల్ ఫామ్​లో ఉన్నారు. మొదట పఠాన్ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. మరోవైపు జవాన్ మూవీ ఇప్పటి వరకు రూ.1100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news