పటాస్ యాదమ్మ రాజు తీసుకున్న కట్నం ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?

-

ప్రముఖ ఈటీవీ ఛానల్ లో మల్లెమాల వారు నిర్వహించిన పటాస్ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి కమెడియన్లు పరిచయమయ్యారు. అలాంటి వారిలో నూకరాజు, సద్దాం, ఫైమా తో పాటు యాదమ్మ రాజు కూడా ఒకరు. పటాస్ షో నుంచి తప్పుకున్న తర్వాత జీ తెలుగు మరియు స్టార్ మా చానల్స్ లో ప్రసారమైన పలు కామెడీ షోలో కమెడియన్ గా కనిపించాడు యాదమ్మ రాజు. ప్రస్తుతం జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సద్దాం తో కలిసి టీం లీడర్ గా యాదమ్మ రాజు సందడి చేస్తున్నారు. ఇటీవలే ఈయన ప్రేమించిన స్టెల్లా రాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే అందరికీ స్టెల్లా రాజ్ బాగా సుపరిచితం . అలాగే వీరి ప్రేమ వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే. వివాహానికి ముందే లివింగ్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఎన్నో వీడియోలను చేస్తూ అభిమానులకు దగ్గరయ్యారు. నాలుగు సంవత్సరాల పాటు సాగిన వీరి ప్రేమాయణం ఇటీవల పెళ్లితో ముగిసింది. ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ సమయంలోనే యాదమ్మ రాజు ఎంత కట్నం తీసుకున్నాడు అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యాదమ్మ రాజు అసలు కట్నం తీసుకోలేదట. స్టెల్లా యొక్క కుటుంబ సభ్యులు ఆమెకు కొంత మొత్తంలో బంగారం ఇవ్వడంతో పాటు యాదమ్మ రాజుకి కూడా బంగారం పెట్టినట్లు సమాచారం.

ప్రేమించిన అమ్మాయి కోసం అతను కట్నం తీసుకోలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజును చూసి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news