భక్తి: ఈ తప్పులు చేస్తే ధననష్టం కలుగుతుంది..!

-

ధన నష్టం కలగకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకుండా ఉండటం మంచిది అని పండితులు చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా మనం చేసే చిన్న చిన్న తప్పులు నెగిటివ్ ఎనర్జీని తీసుకు వస్తాయి.

దీని కారణంగా ధన నష్టం, గొడవలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ధన నష్టం కలగకుండా ఉండాలంటే అసలు ఈ తప్పులు చేయకుండా ఉండడం మంచిదని పండితులు చెప్పడం జరిగింది. మరి ఇక ఆలస్యమెందుకు వాటి కోసం మనం ఇప్పుడే తెలుసుకుందాం.

లక్ష్మీ దేవికి ఎరుపు రంగు పూలు మరియు కలువ పూలు అంటే చాలా ఇష్టం. వాటిని లక్ష్మీ దేవికి పెట్టడం మంచిది. కాబట్టి పూజ సమయంలో ఈ పూలను లక్ష్మీ దేవికి సమర్పిస్తే ధన నష్టం కలగకుండా ఉంటుంది.

అదే విధంగా సూర్యాస్తమయం సమయంలో ఉప్పు, పసుపు వంటివి ఎవరికీ ఇవ్వడం మంచిది కాదు ఇలా చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. దీని కారణంగా ధన నష్టం కలుగుతుంది. కనుక ఈ తప్పు కూడా చేయకుండా ఉండటం మంచిది.

ఎక్కువ సేపు నిద్ర పోయే వాళ్ళు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. కాబట్టి అన్ని వేళలా నిద్ర పోకండి. అంతే కాదు రాత్రిపూట జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కొరకడం వంటివి చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది కాబట్టి ఈ తప్పులు కూడా మీరు చేయొద్దు ఈ తప్పులు చేయకుండా ఉంటే ధననష్టం కలుగకుండా ఉంటుందని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news