Vastu Tips : సాయంత్రం పూట ఈ తప్పులను అస్సలు చెయ్యొద్దు.. లేకపోతే దరిద్రం పట్టుకుంటుంది..!

-

Vastu Tips: వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఆ ఇంటికి మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ కలిగి సంతోషంగా ఉండడానికి అవుతుంది. చాలా మంది చేసే పొరపాట్ల వలన ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా సాయంత్రం పూట ఈ తప్పులని అసలు చేయకూడదు. సాయంత్రం పూట ఈ పనులు చేయడం వలన దరిద్రం పట్టుకుంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి మంచి జరగాలని ఆర్థికంగా బాగుపడాలని అనుకుంటారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని అనుకుంటారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా అనుకున్న జీవితాన్ని గడప లేకపోతూ ఉంటాము. జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మనం చేసే చిన్న తప్పులు మన కష్టాలకు దారితీస్తాయి. వాస్తు ప్రకారం సాయంత్రం కొన్ని పనులు అసలు చేయకూడదు దీని వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. సూర్యాస్తమయం అయ్యాక కొన్ని తప్పులు చేయడం వలన కష్టాలు, పేదరికం, దుఃఖం సంభవిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. ఈ సమయంలో దేవతల్ని పూజించాలి. నిద్రించడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకకూడదు. ఈ తప్పు చేస్తే కూడా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఊడ్చడం, తుడవడం వంటివి చేయకూడదు. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో మాత్రం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా ఇబ్బందిని ఎదుర్కోవాలి చేస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. దరిద్రం పట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news