
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 12, కరీంనగర్ 14, సిరిసిల్ల 3, పెద్దపల్లి జిల్లాలో 28 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.