దేవరకొండ డివిజన్‌లో కరోనా కల్లోలం

-

నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శుక్రవారం 1,121 మందికి పరీక్షలు నిర్వహించగా 159 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా దేవరకొండ, కొండమల్లేపల్లి, డిండిలలో కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే నేడు పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపయ్యింది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news