యాదాద్రి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో పోటెత్తారు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కొండ కిందగల కల్యాణకట్ట, కొండపైన ప్రసాదాల విక్రయశాల, తిరు వీధులు భక్తులతో సందడిగా మారాయి.
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి ఆలయం
By Naga Babu
-
Previous article
Next article