రంగారెడ్డి జిల్లాలో అమానుషం

-

నాచరం పరిధిలోని రాంరెడ్డినగర్ ఎల్లమ్మ దేవాలయం సమీపంలో అమానుష ఘటన జరిగింది. దేవాలయం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ తల్లి తన శిశువును వదిలివెళ్లింది. స్థానికులు పోలీసుల సమాచారం అందించడంతో శిశువును ఆసుపత్రికి తరలించారు. ఆడబిడ్డ పుట్టిందనే వదిలెళ్లి ఉంటుందని స్థానికులు తెలిపారు. పాపపై చీమలు, ఎలకలు కరిచిన గాయాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో అధికారులు సైతం భావోద్వేగానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news