మెదక్ జిల్లాలో మరో టూరిస్ట్ స్పాట్

-

మెదక్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ ( వనదుర్గా ప్రాజెక్టు) ఇక టూరిస్ట్ స్పాట్‌గా మారనుంది. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరిక మేరకు వనదుర్గా ప్రాజక్టును టూరిస్ట్ స్పాట్‌గా తయారు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ అభివృద్ధి బాధ్యతలను మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్‌లపై పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news