ఎల్బీనగర్: హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్

-

ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గత వారం జరిగిన హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 1న కేకే గార్డెన్ వెనుక ఖాళీ స్థలంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కర్మన్‌ఘాట్ శుభోదయనగర్‌కు చెందిన వైదుగుల నర్సింహారెడ్డి(38) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులలో బుధవారం కర్మన్‌ఘాట్‌కు చెందిన వైలపుదాస్ మహేష్‌ను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news