భక్తులకు అనుమతి లేదు

-

కూకట్‌పల్లి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూసాపేట డివిజన్ పాండురంగనగర్‌లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, 14న గోదాదేవి కల్యాణాన్ని ఆలయ అర్చకుల సమక్షంలోనే నిర్వహిస్తామని కార్యనిర్వహణ అధికారి జీఏకే కృష్ణ తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కల్యాణానికి భక్తులకు అనుమతి లేదని తెలిపారు. భక్తులు సహకరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news