మెదక్ : రామాయంపేటలో గంజాయి పట్టివేత

-

రామాయంపేట: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రామాయంపేట ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు పోలీసులు రామాయంపేట పట్టణంలో మంగళవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 250 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, బైక్‌ను సీజ్ చేశారు. కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news