వరంగల్ : లక్నవరంలో సందర్శకుల కోలాహలం

-

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద ఈరోజు భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో సందర్శకులు, పర్యాటకులు చెరువు వద్దకు చేరుకొని రోప్ వంతెనపై సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. కాగా మేడారం తిరుగు ప్రయాణంలో సందర్శకులు లక్నవరం చేరుకుంటున్నారు. సందర్శకులు రావడంతో నిర్వాహకులు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news