ములుగు: 2 ఇసుక లారీలు ఢీ

-

ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని వేప చెట్టు సెంటర్ సమీపంలో ఆదివారం ఉదయం 2 ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మితి మీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. లారీల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news