
ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. అందులో భాగంగా రూ.100 టికెట్ల దర్శనం, కొబ్బరికాయ విక్రయం, విఐపి దర్శనం, అన్నదానం విరాళాలు, వేద ఆశీర్వచనం, సుప్రభాత సేవ, వాహన పూజ, యాదఋషి నిలయం, కళ్యాణ కట్ట, పాత గుట్ట, ఇతర విభాగాల ద్వారా స్వామివారి ఖజానాకు రూ. 13,11,680 ఆదాయం వచ్చినట్లు తెలిపారు