ఇండియన్ రైల్వేస్ లో 904 ఉద్యోగాలు.. వివరాలివే…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నా వాళ్ళు అప్లై చెయ్యచ్చు. దీనిలో మొత్తం 904 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి.

 

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. టెన్త్ క్లాస్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. ఈ పోస్టులకి కర్నాటక, గోవాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, తమిళనాడులోని ధర్మపురి, సేలం, వేలూర్, మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేయచ్చు.

ఇక అర్హత విషయం లోకి వస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. హుబ్లీ డివిజన్ 237, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ 217, బెంగళూరు డివిజన్ 230, మైసూరు డివిజన్ 177, సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు 43. ఇది ఇలా ఉంటే వయస్సు వచ్చేసి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. పోస్టుల వివరాల మొదలు పూర్తి సమాచారాన్ని ఈ లింక్ లో చూసి అప్లై చేసుకోచ్చు. https://jobs.rrchubli.in/ActApprentice2021-22/

Read more RELATED
Recommended to you

Latest news