కరోనా వ్యాక్సిన్‌పై WHO సంచలన ప్రకటన..అప్పటి వరకు వ్యాక్సిన్‌పై..

-

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం ఆత్రతగా ఎదురు చూస్తున్న వేళ కీలక ప్రకటన చేసింది WHO. ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్లలో 2021లోపు ఒక్కటైనా అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఒకవేళ వ్యాక్సిన్‌ వస్తే ఎవరికి ముందు ఇవ్వాలి? చివరాఖరికి ఎవరికి ఇవ్వాలి? అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చింది.

కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారు నిరాశ ఎదుర్కొంటున్నారు.వ్యాక్సిన్ కోసం పలుదేశాల్లో ట్రయల్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, 2021 వరకు ఒక్క వ్యాక్సిన్‌  అందుబాటులోకి వస్తుందని WHO తెలిపింది. అయితే, అది తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడింది. దీంతో అందరికీ ఒకేసారి పంపిణీ చేయడం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది.

వైర‌స్ వ‌ల్ల రిస్క్‌లో ఉన్న హెల్త్ వ‌ర్కర్లకు ముందుగా టీకా అందుతుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ప‌లు రకాల క‌రోనా టీకా ట్రయ‌ల్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, ముందుగా ఎవ‌రికి టీకా ఇవ్వాల‌న్న అంశంపై చ‌ర్చలు జ‌రుగుతున్నాయని ఆమె చెప్పారు. 2021 వ‌ర‌కు క‌నీసం ఒక్క వ్యాక్సిన్ అయినా వ‌స్తుంద‌ని ఆమె అన్నారు. కానీ ఆ టీకా చాలా త‌క్కువ మోతాదులో అందుబాటులో ఉంటుంద‌న్నారు. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారియర్స్‌కు ముందుగా టీకా ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకోసం చాలా మంది అంగీక‌రించారని తెలిపింది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, యువతీయువకులు 2022 వ‌ర‌కు క‌రోనా టీకా కోసం వేచి చూడాల్సి ఉంటుంద‌ని స్వామినాథన్‌ చెప్పారు.త్వరలోనే క‌రోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి మార్గద‌ర్శకాలు రానున్నాయి. వైర‌స్ మ‌ర‌ణాల సంఖ్య ప‌ట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని ప్రపంచదేశాలను హెచ్చరించింది WHO.

Read more RELATED
Recommended to you

Latest news