గవర్నర్ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ‘తెలంగాణ ఆవిర్భావ వేడుకలు’

-

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంటే.. మరోవైపు ప్రతిపక్షాలు కూడా వేడుకలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 20 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ కూడా అవతరణ దినోత్సవ వేడుకలు జరిపేందుకు నిశ్చయించింది.

అయితే కేంద్ర సర్కార్ కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తరుఫున  అజాది కా అమృతోత్సవంలో భాగంగా గోల్కొండ కోటలో రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనుండగా… ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ వేడుకలకు హాజరవుతారన్నారు. వేడుల్లో మోదీ తొమ్మిదేళ్ల పాలనకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు పూర్తి సహకారం అందిస్తుమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు

Read more RELATED
Recommended to you

Latest news