కేసీఆర్ కు బూట్లు పంపినా పాదయాత్రకు రావడం లేదు – షర్మిల

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపినా పాదయాత్రకు రావడం లేదని ఎద్దేవా చేశారు వైఎస్‌ షర్మిల. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయ్యి పదో సంవత్సరం అవుతుందని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయ్యిందని వెల్లడించారు. బంగారు తెలంగాణ అయ్యిందా? లిక్కర్ తెలంగాణ రాష్ట్రంగా మార్చారని ఆగ్రహించారు.

5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. ప్రతిఒక్కరిపై లక్షన్నర అప్పు మీద పెట్టారని నిప్పులు చెరిగారు. రైతు రుణమాఫీ చేసేందుకు కూడా డబ్బులు లేవు. ఆ డబ్బులు ఏమయ్యాయని నిలదీశారు. కాళేశ్వరంలో 70 వేల కోట్ల అవినీతి చేశారని.. దేశం మొత్తం మీద ఎంపీలను గెలిపించుకుంటానని బీఆర్ఎస్ పెట్టారని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. అవినీతి సొమ్మంతా కేసీఆర్ దగ్గరే ఉందని.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని ఆగ్రహించారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news