జగన్ కు షాక్ ఇచ్చిన అటార్నీ జనరల్…!

-

ఏపీ సిఎం వైఎస్ జగన్ కు అటార్నీ జనరల్ షాక్ ఇచ్చారు. లాయర్ అశ్వినీ ఉపాధ్యాయకు అటార్నీ జనరల్ లేఖ రాసారు. గతంలో జగన్‍పై కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి కోరుతూ కేకే వేణుగోపాల్‍కు లేఖ రాసారు అశ్వినీ ఉపాధ్యాయ. ఆ లేఖకు ఆయన తిరిగి సమాధానం చెప్పారు. జగన్ సీజేఐకి రాసిన లేఖ కచ్చితంగా కోర్టు ధిక్కారమే అని ఆయన అన్నారు.

Andhra Pradesh, Aug 17 (ANI): Andhra Pradesh Chief Minister YS Jagan’s review on the Godavari floods in Vijayawada on Monday. (ANI Photo)

సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి జస్టిస్ ఎన్వీరమణ తీర్పు తర్వాత ఈ లేఖ రాయడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని విషయాలు సీజేఐకి తెలుసు అని అన్నారు. ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం నా అనుమతి అవసరం లేదు అని ఆయన అన్నారు. ఇప్పటికే జగన్‍పై 31 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news