తెలంగాణ లో కొత్త‌గా 157 కొవిడ్ కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో కొత్త‌గా 157 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి.అలాగే క‌రోనా మ‌హ‌మ్మారి కాటుకు ఒక‌రు మృతి చెందారు. అలాగే తెలంగాణ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యం లో 36,147 మంది క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో కేవ‌లం 157 మంది కే పాజిటివ్ అని తెలింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,73,469 మంది కి క‌రోనా వైర‌స్ సోకింది.

corona
corona

అలాగే క‌రోనా మ‌హ‌మ్మారి కాటు కు ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,973 మంది మ‌ర‌ణించారు. అయితే గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ వ్యాప్తంగా 156 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. అలాగే నేటి కి క‌రోనా మ‌హ‌మ్మారి బారీన ప‌డి కోలుకున్న వారి సంఖ్య రోజు రోజు కు పెరుగుతున్నారు. అలాగే ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3,741 మంది కరోనా వైర‌స్ తో పోరాడుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగ రాష్ట్రం లో క‌రోనా వైర‌స్ రోజు రోజు కు బ‌ల‌హీన పడుతుంది. అయినా ఈ కరోనా వైర‌స్ ప‌ట్ల జాగ్ర‌త్త గా ఉండాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news