భారత్ లో కాస్త తగ్గిన కరోనా కేసుల నమోదు !

-

భారత్ లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయతే కొద్ది రోజులుగా ప్రతి రోజూ ఎనభై వేలకి పైగా కేసులు నమోదవుతున్నాయి. కానీ ఈరోజు రోజూ కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.

coronavirus
coronavirus

కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75,809 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1133 మంది మరణించారు. ఇక నిన్నటిదాకా నమొదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 42 లక్షలను దాటింది. మొత్తం కేసుల సంఖ్య 42,80,423గా ఉంది. ఇక ఈ కేసులలో 8,83,697 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 33,23,951 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 72,775 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news