తెలంగాణా కరోనా : 1,486 కేసులు, 7 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. ఆదివారం టెస్ట్ లు బాగా తగ్గించడంతో కేసులు కూడా బాగా తగ్గాయి. మళ్ళీ టెస్ట్ లు పెంచడంతో కేసులు కూడా పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,486 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,24,545 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 7 గురు మరణించారు.

ఇప్పటి వరకు 1282 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 20,686గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,02,577 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,891 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 90.21% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 88.6% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 42,299 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 38,98,829 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 235 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news