ఫ్యాక్ట్ చెక్: ఇండియన్ రైల్వేస్ లక్కీ డ్రా తో.. రూ.6,000..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.

వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వార్త వచ్చింది. మరి ఆ వార్త నిజమా కాదా అనేది చూద్దాం. ఇండియన్ రైల్వేస్ లక్కీ డ్రా ని నిర్వహిస్తోందని.. దీనితో ఆరు వేల రూపాయలను పొందచ్చని ఓ వార్త వచ్చింది.

అయితే మరి నిజంగా ఇండియన్ రైల్వేస్ లక్కీ డ్రా ని నిర్వహిస్తోందా..? ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఇండియన్ రైల్వేస్ లక్కీ డ్రా ని నిర్వహిస్తోంది అని వచ్చిన వార్త వట్టి నకిలీ వార్త మాత్రమే. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. ఇది ఫేక్ వార్త మాత్రమే. @RailMinIndia తో వచ్చినది నిజం కాదు. ఇది ఫేక్ ఏ. కనుక ఇలాంటి లక్కీ డ్రా లతో జాగ్రత్త వుండండి. నకిలీ వార్తలను నమ్మి అనవసరంగా మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించింది. ఇండియన్ రైల్వేస్ లక్కీ డ్రా ని నిర్వహించడం అనేది అబద్దం అని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news