తల్లి శవంపై కూర్చొని పూజలు చేసిన అఘోరా… వీడియో

-

అతడు అఘోరా. వారణాసి ప్రాంతంలో అఘోరా విద్యలు నేర్చుకున్నాడు. అఘోరాగా బతుకుతున్నాడు. ఆ అఘోరా మణికందన్(35) తల్లి ఇటీవల చనిపోయింది. ఆమె పేరు మేరీ.. వయసు 70 ఏళ్లు. తమిళనాడులోని మేలకొందరకొట్టాయ్ ఆమె ఊరు. ఆమె భర్త ఇదివరకే చనిపోయాని ఒంటరిగానే జీవితం వెళ్లదీస్తోంది. కొడుకు అఘోరాగా మారి.. వారణాసిలోనే ఉంటున్నాడు.

తన తల్లి చనిపోయిన విషయం తెలుసుకున్న మణికందన్ తన ఊరుకు చేరుకొని తల్లి అంత్యక్రియలు చాలా వింతగా జరిపాడు. ఇదివరకు ఎవ్వరూ చేయని రీతిలో వింతగా అంత్యక్రియలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోలో వైరల్ గా మారింది. తల్లి మృతదేహంపై కూర్చొని ధ్యానం చేశాడు. ఏవేవో పూజలు చేశాడు. అతడితో పాటు చాలామంది అఘోరాలు వచ్చాడు. వాళ్లు కూడా పెద్దగా అరుస్తూ… హరహర మహాదేవ అంటూ నినాదాలు చేశారు. ఆమెకు పూజలు చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.


(Video Courtesy: NTV)

Read more RELATED
Recommended to you

Exit mobile version