Viral : ఆటోచార్జీ రూ.30 కోసం గొడవ.. స్నేహితుడిని చంపిన యువకుడు

-

ఆటో చార్జీ విషయంలో జరిగిన చిన్న గొడవ కారణంగా స్నేహితుడిని చంపిన దారుణమైన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో రూ.5ఫ్యాక్షన్ గురించి వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో అలాంటి గొడవల వల్ల జరిగిన హత్యలే చాలా ఎక్కువ అవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఒక రూపాయి కోసం స్నేహితుడినే చంపిన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. తర్వాత బిర్యానీ డబ్బుల కోసం ఫ్రెండ్ ని హత్య చేసిన ఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని గోండాకు చెందిన సైఫ్ జాహిద్ అలీ, చక్కన్ అలీ స్నేహితులు. వీరు ఇటీవలే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ముంబై వెళ్లారు. అక్కడ కుర్లా ప్రాంతంలో దిగి ఆటోరిక్షా చార్జీ చెల్లించే విషయంలో స్నేహితుల మద్య వివాదం తలెత్తింది. గొడవ కాస్త ముదిరి హింసకు దారి తీయడంతో సహనం కోల్పోయిన జాహిద్ అలీ తన స్నేహితుడు చక్కన్ అలీని హత్య చేసాడు. స్నేహితుడిని చంపిన అనంతరం నిందితుడు జాహిద్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ కు సమాచారం అందించడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేసి కుర్లా పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news