వీడియో.. ఆ పాట‌కు డ్యాన్స్ చేసి ఫేమ‌స్ కావాల‌నుకుంటే.. చివ‌ర‌కు ట్విస్టు..

-

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఒక్క వీడియోతో ఓవ‌ర్ నైట్ లో సెల‌బ్రిటీలుగా అయిపోతున్న వారి సంఖ్యే ఎక్కువ‌గా ఉంది. ఎంత‌లా అంటే అస‌లు ఏమీ లేని చోట ఏదో ఒక‌టి సృష్టించి చివ‌ర‌కు ఆ వీడియో కాస్త వైర‌ల్ గా మార‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఇలాంటివే ఫాలో అవుతున్నారు. ఇక రీసెంట్ గా పెండ్లి బ‌రాత్‌లో బుల్లెట్ బండి సాంగ్ కు ఓ న‌వ వ‌ధువు డ్యాన్స్ చేస్తే ఎంత‌లా వైర‌ల్ అయిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. పెండ్లిలో ఏది చేసినా దానికి ఎంతో కొంత ఫేమ్ వ‌చ్చేస్తుంది. అలాంటిది ఆ బుల్లెట్టు బండి పాట‌కు త‌గ్గ‌ట్టు ఆ వ‌ధువు డ్యాన్స్ చేయ‌డం ఇక్క‌డ ఇంకో విష‌యం.

అయితే ఆ వ‌ధువు డ్యాన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా పెండ్లిలో సాగ‌నంపుతున్న‌ట్టు చ‌క్క‌గా కుద‌ర‌డంతో అది కాస్తా ఓవ‌ర్ నైట్‌లో ఆ క‌పుల్స్ ను సెల‌బ్రెటీల‌ను చేసేసింది. అయితే ఆ వ‌ధువు సాయి శ్రీజ త‌న భ‌ర్త‌కు ఆ సాంగ్ ను డెడికేట్ చేస్తూ అలా డ్యాన్స్ చేసింది. ఇక చుట్టూ ఉన్న వారంతా కూడా దాన్ని వీడియో తీసి స్టేట‌స్ లు పెడితే ప్ర‌తి ఒక్క‌రినీ మెస్మ‌రైజ్ చేసేసింది ఆ వీడియో. ఇక రెండు రోజుల పాటు ఫేస్ బుక్ లేదా వాట్సాప్ లో వారి వీడియోలే టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోయాయి. కొత్త జంట కాస్తా సెలబ్రిటీ జంట‌గా మారిపోయింది.

ఇక వీరిలాగే డ్యాన్స్ చేసి ఫేమ‌స్ అవ్వాల‌నుకుందేమో ఏమో తెలియ‌దు గానీ ఓ న‌ర్సు ఇలాగే డ్యాన్స్ చే్తే చివ‌ర‌కు త‌న ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండ‌ల పీహెచ్ సీలో ప‌నిచేస్తున్న జ్యోతి అనే న‌ర్సు స్వాతంత్ర్య దినోత్సవ రోజున ఇదే బుల్లెట్ బండి సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఇక అది కాస్తా సోష‌ల్ మీడియా ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిది. ఇక వారు వెంట‌నే ఆమెకు మెమో జారీ చేసేశారు. అయితే జ్యోతి మాత్రం తోటి ఉద్యోగులు చేయాల‌ని కోరితేనే చేశాన‌ని చెప్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news