అయోధ్య విగ్రహ ప్రతిష్ట రాజకీయ కార్యక్రమం కాదు: కిషన్ రెడ్డి

-

జనవరి 22న అయోధ్య రామాలయం లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం ప్రాంతాలు కులాలకు అతీతంగా ఎదురుచూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాజకీయాలకి అతీతంగా అయోధ్య రామయ్య ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజల్ని ఆహ్వానిస్తుందని చెప్పారు. బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కి కంటగింపుగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తీరు దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానం ఇంకోసారి స్పష్టమైందని అన్నారు. రాముడి ప్రాణ ప్రతిష్ట రోజు అయోధ్యకి రాక పోవడం రాజకీయ దృక్పథం తో కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం తీసుకోవడం జరిగిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఇది రాజకీయ కార్యక్రమం కాదని చెప్పారు కిషన్ రెడ్డి. రాముడి యొక్క ఉనికిని కొట్టి వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు బహిష్కరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news