పాదాల్లో సూదులు గుచ్చుతున్నట్లుగా ఉందా..? ఈ మందులే కారణం

-

ఒక్కొక్కరి బాడీతీరు ఒక్కోలా ఉంటుంది. కొందరి శరీరం బాగా చల్లగా ఉంటుంది. మరికొందరిది బాగా జ్వరం వచ్చినట్లు ఎప్పుడూ కాలుతూనే ఉంటుంది. వారి బాడి అంత వేడిగా ఉంటుంది. సాధారణంగా అందరి పాదాలు గోరువెచ్చగా ఉంటాయి. ఇది సహజం..కానీ కొంతమందికి పాదాలు చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి. మంచు ముక్కలా అనిపిస్తాయి. ఇలా ఉండటం సాధారణం కాదు.. సమస్యే.. వీటికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇలా పాదాలు అతిగా చల్లగా ఉండటాన్నే కోల్డ్‌ ఫీట్‌ అంటారు. చల్లని పాదాలు రక్తప్రసరణ సరిగా జరగకపోవడానికి సంకేతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం. శరీరంలోని అంతర్లీన సమస్యకు మరొక కారణం కూడా కావచ్చని చెప్తున్నారు.

పాదాలు చల్లగా మారడానికి కారణాలు ఏంటంటే..

  • ఆటో ఇమ్యూన్ పరిస్థితులు..
  • రక్తహీనత
  • రక్తప్రసరణ సమస్యలు
  • గుండె జబ్బులు
  • ధమనుల్లో బ్లాకేజ్
  • పెరిఫెరల్ న్యూరోపతి అనేది మధుమేహం వల్ల వచ్చే సమస్య. ఇది పాదాల్లోని నరాలను దెబ్బతీసి వాటిని చల్లబరుస్తుంది
  • పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వల్ల కాళ్ళు, పాదాలకు రక్తప్రవాహం మందగించేలా చేస్తుంది. ఇది అధిక ధూమపానం అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వయస్సు సంబంధిత సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు.
  • రేనాడ్ ఫినామినన్ వ్యాధి వల్ల కాలి వేళ్ళలో ఉన్న రక్తనాళాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. వీటి వల్ల రక్తప్రవాహం పరిమితం చేస్తుంది. చర్మం రంగులోని మార్పులు వస్తాయి. పాదాలు మీద సూదులతో గుచ్చుతున్నట్టుగా ఉంటుంది.
  • హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా పాదాలు చల్లగా అనిపిస్తాయి.
    నాడీ వ్యవస్థలో ఇబ్బందులు వల్ల కూడా జరుగుతుంది.

పాదాలు చల్లగా మారుతున్నాయ్ అనేందుకు సంకేతాలు ఇవే..

  • పాదాలు శరీరంలోని మిగిలిన భాగాల కంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి.
  • పాదాలు, కాలి వేళ్ళలో తేలికపాటి నొప్పిగా ఉంటుంది.
  • పాదాలు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  • చేతులు, కాళ్ళలో బలహీనత, నొప్పి, తిమ్మిరిగా ఉంటుంది.
  • పాదాలు లేత ఎరుపు లేదా నీలం రంగులోకి మారతాయి.
  • రాత్రివేళ పాదాలు మరింత చలిగా అనిపిస్తాయి.

పాదాలు ఐస్ ముక్కల్లాగా అనిపించడానికి కారణాలు…

కాళ్ళు, పాదాల్లో రక్తప్రసరణ సరిగా జరగకపోతే చల్లగా అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అంటే రక్తం పాదాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని సార్లు అవి మూసుకుపోవడం, గట్టి పడటం జరుగుతుంది. అప్పుడు రక్తం ప్రవహించడం కష్టమవుతుంది. క్రమం తప్పకుండా తీసుకునే మందుల వల్ల కూడా ఒక్కోసారి రక్త ప్రసరణకి ఆటంకం కలుగుతుంది.

పాదాలు చల్లబడటానికి కారణమయ్యే మందులు..

  • బీటా బ్లాకర్స్ అధిక రక్తపోటు అదుపులో ఉంచుకునేందుకు తీసుకుంటారు.
  • ఎర్గోటమైన్ తలనొప్పి, మైగ్రేన్ కోసం తీసుకుంటారు
  • జలుబు, దగ్గు కోసం వాడే సూడోపెడ్రిన్ వల్ల కూడా పాదాలు చల్లగా మారిపోతాయి.

ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?

ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఒకవేళ మందుల వల్ల పాదాలు చల్లగా అవుతుంటే వైద్యులను సంప్రదించి ఇతర మందులు తీసుకోవాలి.. ఇవే కాకుండా ఈ పనులు చేయొచ్చు..

  • కంప్రెషన్ సాక్స్ ధరించాలి
  • సమతుల్య ఆరహం తీసుకోవాలి
  • రక్తప్రసరణ మెరుగు పరిచే విధంగా కాళ్ళని కదిలించాలి
  • ప్రతిరోజు కనీసం 30-45 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం

అది సంగతి.. సమస్య ఉంటే ముందు కారణం అంటే ఒక అంచనాకు రండి. దాన్ని బట్టి చికిత్స చేయించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news