వ్యాధి నిరోధక శక్తి ని పెంచే వంట ఇంటి చిట్కాలు….!

-

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇళ్లకే పరిమితమైన ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద శ్రద్ద పెడుతున్నారు.

రోజు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్దాలన్నీబయటికి పోతాయి. మంచి నీళ్ళు మాత్రమే కాక మనం తీసుకునే ఆహారం వేడిగా ఉండేలా చూసుకోవాలి. చల్లటి ఆహార పదార్థాలు దూరం పెట్టాలి. రోజు 30 నిమిషాల పాటు మెడిటేషన్ లేదా యోగా చేయాలి. వంటల్లో పసుపు, జీలకర్ర , ధనియాలు, వెల్లుల్లి ఉపయోగించాలి . తులసి, దాల్చిన చెక్క, మిరియాలు,ఎండు ద్రాక్ష వాడాలి.

‘టీ’ని రోజుకి రెండు సార్లు తాగాలి. బెల్లం, నిమ్మరసం కలిపి తాగితే  ఆరోగ్యానికి చాల మంచిది. ప్రతి రోజు పసుపు పాలు తాగడం కూడా మంచిది. గొంతు నొప్పికి పుదీనా ఆకులు, వాము వాసన చూడాలి. లవంగాలు పొడి చేసుకుని చక్కర, తేనె లో కలిపి రోజు రెండు, మూడు సార్లు తినాలి. జలుబు గా ఉన్నప్పుడు ముక్కు రంధ్రాల్లో నువ్వుల నూనె, కొబ్బరి నూనె పూయాలి. ఒక చెంచా నువ్వుల నూనె తో ఆయిల్ పుల్లింగ్ థెరపీ రోజు ఒకటి లేదా రెండు సార్లు చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news