20-20-20 తో కంటి ఆరోగ్యం పదిలం

-

ఎవరి చేతిలో చూసిన సెల్ ఫోన్లు, ఐప్యాడ్ లు, టాబ్ లు, లాప్ టాప్ లు ఇవే దర్శనం ఇస్తున్నాయి. వీటిని కాసేపు పక్కన పెట్టగానే టీవీ ముందు ప్రత్యక్షం అయిపోతున్నారు. ఇలా అదే పనిగా ఈ ఫోన్లను, టీవీ ను చూస్తూ ఉంటే కళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆరేళ్ల పిల్లల నుంచి కళ్లద్దాలు మొదలవుతున్నాయి. అయితే కంటి చూపును మెరుగు పరచడానికి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక సూత్రాన్ని పాటించాలి అని చెప్తున్నారు నిపుణులు.

20-20-20 అనే సూత్రాన్ని కళ్ళను పాటించమని చెబుతున్నారు. ఇది కంటికి సంబంధించిన ఆరోగ్య సూత్రం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి 20 నిముషాలకు ఒక్కసారి కనీసం 20 అడుగుల దూరంలో వున్న ఏదైనా వస్తువుని. కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ల వాడకం విపరీతంగా పెరిగిన ప్రస్తుత సామాజిక నేపథ్యంలో, ఈ కంటి సూత్రానికి కూడా ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది.

మన కళ్ళు మన ప్రమేయం లేకుండానే నిముషానికి 15 పర్యాయాలు కొట్టుకుంటాయి. సెల్ ఫోన్ని తదేక ద్రృష్టితో చూడడం కారణంగా కళ్ళు కొట్టుకోవడం 7 కి పడిపోయింది. కళ్ళు 15సార్లు కొట్టుకుంటేనే కంటి ఆరోగ్యం బాగుంటుంది. 7 సార్లు కొట్టుకుంటే కళ్ళు దెబ్బ తింటాయి. దీంతో కళ్ళ మీద వత్తిడి మాత్రం విపరీతంగా పెరిగింది. ఫలితం, ద్రృష్టిలోపాలు, తలనొప్పులు, కళ్ళ మంటలు.

మరి ఇటువంటి పరిస్థితుల్లో కంటి వత్తిడిని తగ్గించు కోలేమా? ఎందుకు తగ్గించుకోలేము. తగ్గించాలి అని అనుకుంటే తగ్గించలేనిదేమి కాదు. అయితే ఆ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అన్నదే ముఖ్యం. లాప్ టాప్ గాని, టీవీని గాని, సెల్‌ఫోన్ని గాని వాడేటప్పుడు ప్రతీ 20 నిముషాలకు ఒకసారి కొంత విరామం ఇవ్వాలి.

అది సాధ్యం కాని పరిస్థితుల్లో 20 నిముషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు కళ్ళను మూసుకోవాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే ప్రతి 20 నిముషాలకు 20 అడుగుల దూరంలో వున్న ఏదైనా ఒక వస్తువు పై 20 సెకన్ల పాటు ద్రృష్టిని మళ్లీంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో 20-20-20 సూత్రాన్ని ఆచరించి మన కళ్ళని మనం కాపాడుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news