నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే శరీరంలో ఈ పోషక లోపం ఏర్పడినట్లే..!

-

పూర్తి ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ కచ్చితంగా అవసరం. వాటిలో మెగ్నీషియం కూడా ఒకటి. మంచి నిద్రను పొందాలంటే మెగ్నీషియం ఎంతో అవసరం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా, నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మెగ్నీషియం లోపం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా కండరాలు చిమ్మిరి, ఆందోళన వంటి ఇతర లక్షణాలను కూడా మెగ్నీషియం లోపం వలన ఎదుర్కొంటారు. ప్రతి ఒక్కరికి నిద్ర అనేది ఎంతో అవసరం. ప్రతి రోజు మంచి ఆహార పదార్థాలను తీసుకున్నా సరే, నిద్ర రావడం లేదు అంటే కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే.

ఎప్పుడైతే నిద్రపోతారో శరీరానికి విశ్రాంతి ఇవ్వడమే కాకుండా, శారీరకంగా మరియు మానసికంగా ఎన్నో ప్రక్రియలు జరుగుతాయి. కనుక కచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి నిద్ర ఎంతో అవసరం. ఈ మధ్యకాలంలో ఉద్యోగం వల్ల మరియు ఇతర కారణాల వలన ఎంతో బిజీగా ఉంటున్నారు. అలాగే జీవన విధానం పై అసలు శ్రద్ధ వహించటం లేదు. దీంతో నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం సరైన మోతాదులో శరీరానికి అందకపోవడం వలన నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. ఎప్పుడైతే శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడుతుందో, కండరాలు పట్టేయడం లేక బిగుతుగా మారడం వంటివి జరుగుతాయి. దీంతో నిద్ర పై ప్రభావం పడుతుంది. శరీరానికి సరైన మోతాదులో మెగ్నీషియం అందకపోతే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరిగిపోతాయి.

దీని వల్ల సరైన నిద్రను పొందడం కష్టం అవుతుంది. అంతే కాకుండా, మెగ్నీషియం నరాల వ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. ఎప్పుడైతే మంచి నిద్రను పొందుతారో, మెదడులో కార్యకలాపాలు సరైన విధంగా జరుగుతాయి. కనుక ఆహారంలో భాగంగా మెగ్నీషియంను చేర్చుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్, అరటిపండు, సోయా, ఓట్స్, పాల పదార్థాలు వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కనుక ఈ ఆహార పదార్థాలను కచ్చితంగా తీసుకోవాలి లేక వైద్యుడిని సంప్రదించి సప్లిమెంట్స్ ద్వారా మెగ్నీషియం ను తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news