సాయంత్రం సమయంలో యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

-

శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామాలను చేయడం ఎంతో అవసరం. రోజుకు కొంత సమయాన్ని వాకింగ్, వ్యాయామం వంటి వాటికి కేటాయించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వలన మొత్తం ఆరోగ్యం మెరుగవుతుంది. కనుక, మీ దినచర్యలో యోగా వంటి వ్యాయామాలను తప్పకుండా చేర్చుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం అయినా యోగా చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే యోగా చేయాలని భావిస్తే, నిద్రలేచి కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించడం అవసరం. ఇలా చేయడం వలన క్రమబద్ధమైన దినచర్యను పాటించడానికి సులభమవుతుంది.

ఉదయాన్నే యోగ చేసినప్పుడు కపాల భాతి, సూర్య నమస్కారాలు వంటివి చేయాలి. ఇవి జీవక్రియను మెరుగుపరచడానికి, నాడీ వ్యవస్థను ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. పైగా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దీని వలన మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. సాయంత్రం సమయంలో రెస్టోరేటివ్ ఆసనాలను చేయడం వలన కండరాలలో ఉండే ఒత్తిడి తగ్గుతుంది. దీని వలన కీళ్లు బలంగా మారతాయి. బాలాసనా, మకరాసన, బద్ధ కోనాసనం, ఆనందాసనం వంటి శక్తివంతమైన భంగిమలు శరీరానికి మేలు చేస్తాయి.

మీ దినచర్య ప్రకారం, ఉదయం లేదా సాయంత్రం యోగాకు సమయం కేటాయించండి. అయితే యోగా లో కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అనేక రకాల ఆసనాలను చేయవచ్చు. ఆరోగ్య పరిస్థితుల ప్రకారం, జీవనశైలికి అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవాలి. చాలా మంది ఉదయాన్నే ఎంతో హడావిడిగా ఉంటారు. అటువంటి సమయంలో, సాయంత్రం పనులన్నీ పూర్తయిన తర్వాత ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్ట్రెచింగ్, ఆసనాలను పాటించండి. ఇలా చేయడం వలన శరీరంలో మార్పులను గమనిస్తారు. ఈ విధంగా, ఉదయం లేదా సాయంత్రం సమయంలో యోగాను చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news