తిరుపతి దర్శనంతో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిన యువకులు..!

-

కొన్ని సంఘటనల వల్ల కొత్త ఆలోచలను కలుగుతాయి.. వచ్చిన ఆలోచనలు లైట్ తీసుకునే వాళ్లు చాలామంది ఉంటారు.. కానీ ఆ కుర్రాళ్లు అలా చేయలేదు. వాళ్లకు వచ్చిన ఐడియాను ఇంప్లిమెంట్ చేశారు. దేవుడి దర్శనం కోసం వెళ్లి.. మార్గదర్శనం పొందారు. ఇద్దరు కుర్రాళ్లు ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లారు. దేవుడి దర్శనం చేసుకున్నారు. ఒకరోజు పాటు అక్కడ గడిపారు. ఆ స్నేహితులు సుమారు 24 లీటర్ల నీరు తాగారట. అదే వాళ్లల్లో మార్పును తీసుకొచ్చింది. ఆలోచనను మార్చేసింది. తామే ఒక్కరోజులు ఇన్ని ప్లాస్టిక్‌ బాటిళ్లు వాడితే దేశవ్యాప్తంగా ఎన్ని బాటిళ్లు ఖర్చు అవుతున్నాయో అని అందాసుగా లెక్కేసుకుని ఆశ్చర్యపోయారు.

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలనే ఆలోచనతో..అప్పుడే ఐటీ జాబ్‌కు రిజైన్ చేశారు. రోజుల కొద్ది ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసి చివరకు ఒక ఉపాయానికి వచ్చారు. ఎక్కడికైనా తీసుకెళ్లేలా, ఇంట్లో, ఆఫీసుల్లో వాడుకునేలా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అలా వారికి వచ్చిన ఆలోచనే పేపర్‌ బాక్స్‌, అందులో నీటి నిల్వ చేసేలా ప్రయత్నించి విజయం సాధించారు. వాళ్లే సునీత్‌ తాతినేని, అతని స్నేహితుడు చైతన్య అయినపూడి.

కొన్ని రోజుల మేధోమథనం తర్వాత వారి మెదళ్లలో పుట్టిన ఆవిష్కరణ కారో వాటర్‌. ఇది దేశంలోనే తొలి ఎకో ఫ్రెండ్లీ డ్రింకింగ్ వాటర్ బాక్స్. కారిగేటెడ్‌ పేపర్‌ ఉపయోగించి టేంపర్‌ప్రూఫ్‌ వాటర్‌ బాక్స్‌ తయారు చేశారు. BIB అంటే బాక్స్‌లో బాక్స్ అనే పద్ధతిలో దీన్ని రూపొందించారు. ఇందులో 85శాతం వరకు ప్లాస్టిక్‌ లేకుండా ఈ కారో బాక్స్‌ తయారు చేశారు. దీన్ని రిసైకిల్‌ చేయొచ్చు.. దీన్ని యాప్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఈ కంపెనీ వాళ్లే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అది ఎక్స్‌పయిరీ అయిపోయాక దాని ప్లేస్‌లో కొత్తది ఇచ్చి పాతది తీసుకెళ్లిపోతారు. చాలా తక్కువ ఖర్చుతోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్టు సునీత్‌ అంటున్నారు.

వీళ్లు తయారు చేసిన కారో బాటిల్‌ సుమారు రెండు వందల నుంచి మూడు వందల లీటర్లు నీటిని వడపోస్తుంది. వాటల్ బాటిల్స్‌ కారణంగా ఎంత నష్టం ఉంటుందో వాడే ప్రతిఒక్కరికీ తెలుసు.. కానీ ఖరీదైన అల్ట్రనేటీవ్స్ వాడలేక అందరూ ప్లాస్టిక్ బాటిల్సే వాడుతున్నారు.. వాటి వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులే ఎలాంటి సమస్యలేకుండా పేపర్‌తో కారో బాక్స్ తయారు చేసినట్టు సునీత్‌ వెల్లడించారు.

వినియోగదారుడు కారో వాటర్ బాక్స్‌ను ఆర్డర్ చేసి, దాన్ని ఉపయోగించిన తర్వాత మళ్లీ వాటిని తిరిగి అప్పగించేస్తారు. కారో వాటర్ యాప్ ద్వారా ప్రక్రియ సాగుతుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులు క్రెడిట్ పాయింట్‌లు పొందుతారు. వినియోగదారులు తమ బాక్స్‌లను డెలివరీ చేయడానికి పదే పదే కాల్ చేయాల్సిన అవసరం లేదని యాప్ డెలివరీ సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు సునీత్‌. ఐదు లీటర్ల బాక్స్‌ ప్రైస్‌ 75 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఇరవై లీటర్ల బాక్స్‌ తీసుకోవాలంటే 120 రూపాయాలు పెట్టాల్సి ఉంటుంది. దీంతో బిపిఎ లేదా బిస్ఫినాల్ఎ కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నట్టు సునీత్ అంటున్నారు.

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే ప్రస్తుతం కారో వాటర్ ప్యూరిఫైర్ సేవలు అందిస్తోంది. సేవలు విస్తరించి పెట్టుబడులు ఆకర్షించేందుకు బెంగళూరులో కూడా ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించారట. కారో బాక్స్‌లో కేవలం ట్యాప్‌లోనే ప్లాస్టిక్ ఉంటుంది. యాభై గ్రాముల కంటే తక్కువ. వీలైనంత తక్కువ ప్లాస్టిక్ ఉపయోగించడమే తమ లక్ష్యం అని అంటున్నారు ఈ కుర్రాళ్లు.

Read more RELATED
Recommended to you

Latest news