పే..ద్ద పాత్రలో 5 వేల కిలోల కిచిడీ వండి గిన్నిస్ రికార్డు

-

కిలో కిచిడీ వండటానికే మనం కిందా మీదా పడతాం. కానీ.. వీళ్లు చూడండి ఏకంగా 5 వేల కిలోల కిచిడీని వండుతున్నారు. అది కూడా ఒకే పాత్రలో. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంతకీ.. వీళ్లు ఏదైనా ఫంక్షన్ చేస్తున్నారా? భారీ మొత్తంలో ఎందుకు కిచిడీ వండుతున్నారనేగా మీ డౌట్.

బీజేపీ వాళ్లు ఇవాళ సాయంత్రం భారీ ర్యాలీ చేపట్టబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ఆ ర్యాలీ ఉంటుంది. దాని పేరు భీమ్ మహాసంగమ్ విజయ్ సంకల్ప్. ఆ ర్యాలీకి వచ్చే వాళ్ల కోసమేనట ఈ కిచిడీ. అందరికీ సరిపోయే విధంగా 5 వేల కిలోల కిచిడీని రామ్‌లీలా మైదానంలో వండుతున్నారు. సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగం కూడా ఉంటుందట అక్కడ. అయితే.. బీజేపీ వర్కర్స్, సపోర్టర్స్ కోసం వండే ఈ కిచిడీ గిన్నిస్ రికార్డును క్రియేట్ చేయబోతోంది. కిచిడీ కోసం ఉపయోగించే బియ్యం, ఇతర వస్తువులను ఢిల్లీలో నివసించే దళితుల ఇళ్లలో నుంచి తీసుకొచ్చారట.

2017 నవంబర్‌లో ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ 918 కిలోల కిచిడీని వండి గిన్నిస్ రికార్డు సృష్టించాడట. అది ప్రపంచంలోనే అతి పెద్ద కిచిడీగా రికార్డుకెక్కగా.. ఇప్పుడు 5 వేల కిలోల కిచిడీతో సంజీవ్ రికార్డును తుడిచిపెట్టేశారు బీజేపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news