72 ఏళ్ల తర్వాత పాక్ లో తెరుచుకోనున్న హిందూ దేవాలయం

-

ఆ గుడిని సుమారు వెయ్యి ఏళ్ల కింద సర్దార్ తేజా సింగ్ నిర్మించారు. అందుకే దానికి షావాలా తేజా సింగ్ ఆలయం అని పేరు. భారతదేశ విభజనకు ముందు భారత్ లోనే ఆ గుడి అంతర్భాగం.

వేయ్యేండ్ల చరిత్ర ఆ దేవాలయం సొంతం. కానీ.. 72 ఏళ్ల క్రితం మూతపడింది. అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు లేవు.. పునస్కారాలు లేవు. కానీ.. త్వరలో ఆ గుడి భక్తులకు అందుబాటులోకి రానుంది. పాకిస్తాన్ లోని హిందువులు ఆ గుడిలో ఇక పూజలు చేయొచ్చు. దేవుడిని మొక్కొచ్చు. ఆ గుడిని తెరవాలని పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ గుడి పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో ఉంది.

after 72 years hindu temple to be opened in pakistan

ఆ గుడిని సుమారు వెయ్యి ఏళ్ల కింద సర్దార్ తేజా సింగ్ నిర్మించారు. అందుకే దానికి షావాలా తేజా సింగ్ ఆలయం అని పేరు. భారతదేశ విభజనకు ముందు భారత్ లోనే ఆ గుడి అంతర్భాగం. భారత్ నుంచి పాక్ విడిపోయాక.. ఆ గుడిలో పాక్ లో అంతర్భాగం అయింది. ఆ తర్వాత ఆ గుడిని మూసేశారు.

after 72 years hindu temple to be opened in pakistan

బాబ్రీ మసీదును హిందువులు కూల్చేసిన తర్వాత… దానికి నిరసనగా పాక్ లోని ఈ గుడిని పాకిస్థానీయులు కొందరు ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఇక ఆ గుడి వైపు కూడా ఎవ్వరూ వెళ్లలేదు. ఆ గుడిని సందర్శించడం ఆపేశారు హిందువులు.

after 72 years hindu temple to be opened in pakistan

తాజాగా… ఆగుడిని తెరవాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆలయం పునరుద్దరణ పనులు కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే భక్తులు ఆ గుడిని సందర్శిస్తూ పూజలు నిర్వహిస్తున్నప్పటికీ… ఆలయ పునరుద్దరణ పనులు అయ్యాక అధికారికంగా ఆలయాన్ని ప్రభుత్వం తెరవనుంది.

after 72 years hindu temple to be opened in pakistan

Read more RELATED
Recommended to you

Latest news