పవన్ కల్యాణ్ పాటకి డ్యాన్స్ ఇరగదీసిన సీఎం రమేశ్..

-

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ తో ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తె పూజ నిర్చితార్థం నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాటకు డ్యాన్స్ ఇరగదీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని ‘అమ్మో… బాపుగారి బొమ్మో’ పాటకు అదిరిపోయే రేంజ్ లో వీరు స్టెప్పులేశారు.

కాగా, దుబాయ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరి కోసం ఏకంగా 17 ప్రత్యేక విమానాల్లో అతిథులను దుబాయ్‌ తరలించిన సీఎం రమేశ్… అక్కడ వారికి మర్చిపోలేని అతిథ్యమిచ్చారు. దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌ వరకు తీసుకెళ్లడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి మరీ స్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news