ఏదో రాయే కదా పారేద్దాం అనుకున్నారు..కానీ ఇప్పుడు దాని విలువ 20కోట్లట.!

-

మధ్యతరగతి కుటంబాలలో ఒక కోటి రూపాయిల దొరికితే..ఎలా ఉంటుంది అసలు..ఇక లైఫ్ టర్న్ అయిపోయినట్లే కదా..అలాంటిది ఆ మహిళకు ఏకంగా 20కోట్లు వస్తున్నాయి. పురాతన వస్తువులు ఏమైనా ఉంటే మీ ఇంట్లో చూసిచూడకుండా వదిలేయకండి..ఎందుకంటే అలాంటి ఓ పురాతన డైమండ్ వల్లే ఓ మహిళ ఇప్పుడు కోటీశ్వరురాలు కాబోతుంది. అసలు ఏలా ఇదంతా జరిగిందో చూద్దాం.

బ్రిటన్‌కి చెందిన ఓ మహిళ దగ్గర పాత గిల్టు నగలున్నాయి. ఆమె వయస్సు 70 ఏళ్లు. నగలు వాడటం ఎప్పుడో మానేసిందట. గిల్టు నగల వల్ల తనకు ఇప్పుడు ఏ ప్రయోజనమూ లేదని పారేద్దామని ఫిక్స్ అయ్యింది. ఆమెకు తెలియని విషయమేంటంటే ఆ గిల్టు నగల్లోనే 34 క్యారెట్ల వజ్రం ఉందని. దాన్ని సాధారణ రాయి అనే ఆమె అనుకుంది. ఆ రాయిని ఓ కార్ బూట్ సేల్‌లో తక్కువ ధరకే కొనుక్కుంది. హైలెట్ ఏంటంటే అది డైమండ్ అని అమ్మినవారికి కూడా తెలియదు.

ఇక ఇల్లంతా శుభ్రం చేసుకోవాలనుకున్న ఆమె..ఈ వస్తువులన్నీ పక్కన పెట్టింది..ఇదే సమయంలో ఆమె ఇంటికి వచ్చిన పక్కింటి వారితే సరదాగా కాసేపు మాట్లాడారు. ఆ మాటల్లో ఆమె ఆ నగల ప్రస్తావన తెచ్చింది. వాళ్లు ఆ నగలను చూసి ఇవి మరీ అంత చెత్తలా లేవు కాబట్టి వేలంలో అమ్మితే ఎంతో కొంత డబ్బు వస్తుంది. పారేయకండి అని సలహా ఇచ్చారు.

నార్త్ టైనెసైడ్.. నార్త్ షీల్డ్స్‌లోని ఫీటోన్బీ ఆక్షనీర్స్ సంస్థకు వెళ్లి తన నగలను వేలంలో అమ్మాలి అనుకుంటున్నట్లు చెప్పి వాళ్లకు నగలతో ఉన్న బాక్సును ఇచ్చింది. వాళ్లు నగలను చూసి వేలం వేస్తామన్నారు. వాటి అంచనా విలువ కట్టాల్సి ఉండగా ఆమె వేరే పని ఉందని నగల బాక్సును వారి దగ్గరే ఉంచి వెళ్లిపోయింది. వాళ్లు బాక్సులో ఉన్నది ప్లాస్టిక్ సింథటిక్ డైమండ్ అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. మూడు రోజులు పాటు ఆ బాక్స్ అలాగే ఉంది. ఆ తర్వాత వజ్రాలను టెస్ట్ చేసే యంత్రంతో టెస్ట్ చేసినప్పుడు ఆ రాయిని నిజమైన 34 క్యారెట్ల వజ్రంగా యంత్రం తేల్చింది. ఆ తర్వాత నిపుణులు కూడా అది నిజమైన వజ్రమే అని స్పష్టం చేశాడు.

ఆ వజ్రం విలువ రూ.20 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వేలంలో ఇంకా ఎక్కువ పలికినా ఆశ్చర్యం అక్కర్లేదు. నవంబర్ 30న దాన్ని వేలం వేయబోతున్నారు. అప్పటివరకూ దాన్ని లండన్‌లోని డైమండ్ క్వార్టర్ హాట్టన్ గార్డెన్స్‌లో ఉంచనున్నారు.ఇదీ సంగతీ..అందుకే మీ ఇంట్లో ఏమైనా పురాతన కాలం నాటి వస్తువులు ఉంటే పారేసేటప్పుడు ఓసారి ఆలోచించండి.

Read more RELATED
Recommended to you

Latest news