తిరుమ‌ల ఘాట్ రోడ్లు బంద్

-

తిరుమ‌ల విష‌యంలో టీటీడీ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల‌ దేవ‌స్థానానికి వెళ్ల‌డానికి రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఈ రెండు ఘాట్ రోడ్ల విష‌యం లో టీటీడీ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ రెండు ఘాట్ రోడ్ల‌ను రాత్రి 8 గంట‌లకు మూసివేయ‌నున్నారు. ఈ రెండు ఘాట్ రోడ్ల‌ను రేపు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మూసివేయ‌నున్నారు.

అయితే మ‌ళ్లి ఈ రోడ్ల‌ను రేపు ఉద‌యం 6 గంట‌ల‌కు తిరిగి వాహానాల‌ను అనుమ‌తి ఇస్తారు. ఘాట్‌ రోడ్డుల లో పలు ప్రాంతాలు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఘాట్ రోడ్ల‌ను మూసి వేస్తున్నారు. అలాగే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులు సాయంత్రం 7 గంటలలోపు ప్రయాణం చెయ్యాలని టీటీడీ బోర్డు తెలిపింది. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ తో పాటు త‌మిళ నాడు రాష్ట్రాల‌లో వ‌ర్షాలు భారీగా ప‌డుతున్నాయి. దీంతో ప‌లు చోట్ల కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news