గర్భవతిని ఆరు కిలో మీటర్లు జోలెలో మోసుకుంటూ తీసుకెళ్లిన ఎమ్మెల్యే..!

-

ఏ విధమైన వాహన సదుపాయం లేని ఓ మారుమూల ప్రాంతంలో నిండు గర్భిణి పురుటి నొప్పులతో బాధపడుతుండగా, విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం ఆమెను జోలెలో మోసుకుంటూ తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లా, పపడహండి సమితి సమీపంలోని కుసుముగుడలో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతోంది. దబూగాంకి చెందిన ఎమ్మెల్యే మన్హర్ రంధారి.. స్థానికంగా ఉన్న గ్రామంలో పర్యటిస్తున్నారు.

ఇంతలోనే అక్కడే ఉన్న ఓ గర్భవతికి నొప్పులు వచ్చాయి.. వెంటనే ఆయన ఆంబులెన్స్‌కి ఫోన్ చేయగా, రోడ్లు బాలేదని.. గ్రామానికి రావడానికి నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది. ఈ విషయం తెలుసుకున్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి వెంటనే గ్రామానికి వచ్చారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో ఆమెను ఉంచి, మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. తమ పట్ల మానవత్వం చూపిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఎమ్మెల్యే చేసిన సేవకు సోషల్ మీడియాలో ప్రశంసల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news