పబ్జీ ఆడేవాళ్ళకి బ్యాడ్ న్యూస్… ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 న పబ్జీ బ్యాన్..!

-

పబ్జి ఆడేవాళ్ళకి బ్యాడ్ న్యూస్..! మొత్తానికి పబ్జి ని ప్రపంచం మొత్తం బ్యాన్ చేస్తున్నారు. నిజంగా ఇది పబ్జి గేమ్ ని ఆడేవాళ్ళకి చెడ్డ వార్త అని చెప్పొచ్చు. IANS ప్రకారం లో ఎండ్ వెర్షన్ అయిన పబ్జి లైట్ ఏప్రిల్ 29న మొత్తానికి తొలగించనున్నారు. 2019 లో ఎంట్రీ లెవెల్ మొబైల్ డివైస్ లో దీనిని మొదలు పెట్టారు.

భారత ప్రభుత్వం పబ్జి మొబైల్ మరియు పబ్జి మొబైల్ లైట్ సెప్టెంబర్ 2న గత ఏడాది పూర్తిగా తొలగించింది. Depplers Crafton పబ్జి ని పూర్తిగా తొలగిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. కరోనా సమయం లో పబ్జి లైట్ చాలా మంది ఉపయోగించారని వాళ్ళకి కష్ట సమయం లో ఇది సహాయం చేసిందని అన్నారు.

అయితే చాలా కష్టాలు తర్వాత ఫైనల్ గా దీనిని తొలగిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 29 నుంచి పబ్జి ని పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. ఇది ఇలా ఉంటే కొన్ని రిపోర్టుల ప్రకారం పబ్జి మొబైల్ ని తిరిగి భారత దేశం లో మరో రెండు మూడు నెలల తర్వాత ప్రారంభించొచ్చు అన్నట్టు తెలుస్తోంది.

91 మొబైల్స్ ప్రకారం భారత ప్రభుత్వం పబ్జి మొబైల్ ని తిరిగి లాంచ్ చేయడానికి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయం పై పబ్జి మొబైల్ ఇంకా ఏమీ స్పందించలేదు. కానీ కంపెనీ అఫిషియల్ గా దీనిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news