వైజాగ్ నుండి కాశ్మీర్ టూర్.. తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ..!

-

IRCTC వివిధ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. విశాఖపట్నం నుంచి కాశ్మీర్ వెళ్లాలనుకునే వాళ్ళకి ఇది సూపర్ ప్యాకేజీ. మరి ఇక ఈ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే.. కాశ్మీర్ వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది.

కాశ్మీర్-హెవెన్ ఆన్ ఎర్త్ పేరుతో ఇది అందుబాటులో ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని అందమైన కొండలు, లోయలు ఇవన్నీ కూడా చూసి వచ్చేయచ్చు. గుల్‌మార్గ్‌ లోని మనోహరమైన పచ్చికభూములు, సోన్‌మార్గ్‌ లోని మంచు పర్వతాలు, పహల్‌ఘమ్‌ లోని మంచు పర్వతాలు ఇవన్నీ చుట్టేయచ్చు. 2023 ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 24 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటు లో వుంది.

ఇది 5 రాత్రులు, 6 రోజుల ప్యాకేజీ. మొదటి రోజు విశాఖపట్నంలో ఇది స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రానికి శ్రీనగర్ రీచ్ అవుతారు. హోటల్‌లో చెకిన్ అయ్యాక షాపింగ్ కి వెళ్ళచ్చు. రాత్రికి శ్రీనగర్‌ లో స్టే చేయాలి. రెండో రోజు శంకరాచార్య ఆలయానికి వెళ్ళచ్చు. మొఘల్ గార్డెన్స్, చెష్మా షాహి, పరి మహల్, బొటానికల్ గార్డెన్ ఇవన్నీ చూడచ్చు.

ఆ తర్వాత దాల్ సరస్సు చూడచ్చు. అలానే సాయంత్రం సన్ సెట్ ని ఎంజాయ్ చెయ్యచ్చు. చార్-చినార్ ఫ్లోటింగ్ గార్డెన్స్ ని కూడా చూడొచ్చు. మూడో రోజు గుల్‌మార్గ్‌‌లో పూలని చూడొచ్చు. అలానే సోన్‌మార్గ్ కూడా ఉంటుంది. ఇక దీని ధర చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ కి రూ.39,120, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.39,910, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.49,305 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news