అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత ఏడ్చినా కన్నీళ్లు ఎందుకు రావు..?

-

ఏడిస్తే.. కన్నీళ్లు రావాలి.. వస్తాయి కూడా. బోనస్ గా ముఖం కూడా వాచిపోతుంది. కానీ.. మీరు ఎప్పుడైనా చూశారా.. అప్పుడే పుట్టిన పిల్లలు ఆసుపత్రి దద్దరిల్లేలా ఏడుస్తారు.. కానీ చుక్క నీరు కూడా రాదు. విపరీతంగా ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడమేంటి. నిజానికి పుట్టిన బిడ్డ ఏడ్వాలి. ఏడ్వకపోతే అదో లొల్లి.. ఏదో ఒకటి చేసి ఏడిపిస్తారు. సరే.. మరి కన్నీళ్లు ఎందుకు రావు అనే విషయానికి వస్తే.. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

ఇలా జరగడం శిశువు శరీర అభివృద్ధికి సంబంధించినది. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లకు ఒక ప్రత్యేక రకమైన వాహిక బాధ్యత వహిస్తుంది. నవజాత శిశువులో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు. డెవలప్ కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన శిశువుకు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు. ఈ వాహిక అభివృద్ధి చెందిన తర్వాతే కన్నీళ్ల రావడం ప్రారంభం అవుతాయని వాళ్లు పేర్కొన్నారు..

నవజాత శిశువులు ఎక్కువగా ఏడుస్తారని, అయితే వారి కన్నీళ్లు రావడానికి సాధారణంగా రెండు వారాలు పడుతుందని శిశువైద్యురాలు తాన్యా ఆల్ట్‌మన్ అంటున్నారు. కొంతమంది పిల్లలకు రెండు వారాలకంటే.. ఎక్కువ టైం పడుతుంది. కొంతమంది పిల్లలలో ఈ నాళం అభివృద్ధి చెందడానికి 2 నెలలు కూడా పట్టవచ్చట.

కంటి ఎగువ కనురెప్పకు దిగువన బాదం ఆకారపు గ్రంధి ఉంది. ఈ గ్రంథి నుండి కన్నీళ్లు వస్తాయి. ఈ గ్రంథి కళ్లలో తేమను గ్రహిస్తుందట. దీని కారణంగా కళ్ల కదలిక తేలికవుతుంది. కన్నీటిని ఉత్పత్తి చేసే ఈ గ్రంథి మేఘంలాగానూ, నాళం గొట్టంలానూ ప్రవర్తిస్తుందని, దీని ద్వారా కళ్లలో నుంచి నీళ్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. పెద్దవారికి కూడా ఏడిస్తే.. కళ్లు పొడిబారిపోతాయి. కళ్లలో వాటర్ ఉండదు. అందుకే ఎవరైనా ఏడుస్తుంటే.. పక్కనవాళ్లు వెంటనే వాటర్ ఇస్తారు. ఏడ్వటం వల్ల కళ్లలో ఉండే వాటర్ అంతా కరిగిపోతుంది. దాని ద్వారా కళ్ల మంటలు, తలనొప్పి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news