ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని అదే స్థాయిలో దేశ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ బుధవారం సర్దార్ పటేల్ ‘ఐక్యతా విగ్రహాన్ని’ ఆవిష్కరించిన కొద్ది సేపటికే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్డీఏ ప్రభుత్వం సీబీఐ, ఆర్బీఐ వంటి సంస్థలను ఇరకాటంలో పెట్టేవిధంగా వ్యవహరిస్తున్నాయన్నారు.
‘ఐక్యత విగ్రహాన్ని’ నిర్మించి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..రాహుల్
-
Previous article
Next article