గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల జాబితా సవరణపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఓటరు చిరునామాను క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా చేర్చించాలని సమావేశంలో పాల్గొన్న బల్దియా అధికారులకు సూచించారు. మరణించిన వారి ఓటుని జాబితా నుంచి తొలగించాలన్నారు. అద్దెకు ఉండే వారు ఇల్లు మారినట్లైతే అలాంటి ఓట్లను ఫారం – 7 ద్వారా ఓటు బదిలీకి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ ఏడు పోలీంగ్ కేంద్రాలకు ఒక పర్యవేక్షణాధికారిని నియమించనున్నట్లు దాన కిశోర్ తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణపై జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష
-
Previous article
Next article