జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 15న దవళేశ్వరం బ్యారేజిపై చేపట్టనున్న కవాతుకు సీపీఎం, సీపీఐ పార్టీలు మద్దతు తెలిపాయి. అమరావతిలో సమావేశమైన నేతలు వివిధ అంశాలపై చర్చించారు. పెద్ద ఎత్తున జనసేన కవాతులో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, అభిమానులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సామాజిక మాద్యమాల్లో అధిక ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానలు, ఆదాయ వనరులు, అమలు చేస్తున్న పథకాల తీరు..వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు.
జనసేన కవాతుకు వామపక్షాల మద్దతు..
-
Previous article
Next article