పార్టీ మారిన ఎమ్మెల్యేలు మగాళ్లైతే రాజీనామా చేయాలి: పాడి కౌశిక్

-

రాష్ట్రవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం కాకుండా సవాల్కి ప్రతి సవాలు విసురుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి సవాల్ విసిరారు.పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మగాళ్లైతే రాజీనామా చేయాలని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ‘దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు సిగ్గు, శరం, రోషం ఉండి.. అన్నం తింటుంటే రాజీనామా చేయాలి. మళ్లీ పోటీ చేసి గెలిచి చూపించాలి అని విమర్శించారు. ఈ ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు డప్పు కొడతాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నిక వచ్చే వరకు పోరాడతాం’ అని ఆయన ఆయన ఫైర్ అయ్యారు. కాగా, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందగా, కడియం శ్రీహరి వరంగల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే తెల్ల వెంకట్రావు భద్రాచలం లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news