రాహుల్….రా‘ఫెయిల్’.. రాజ్ నాథ్ సింగ్

-

రఫేల్ యుద్ధ విమానాల గురించి రాహుల్ గాంధీ పస లేని ఆరోపణలు చేస్తూ.. రఫెల్ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన  ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహాధివేశన్‌’పేరుతో నిర్వహించిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ…  దేశ రక్షణ విషయంలో బీజేపీ ఎక్కడా వెనకడుగు వెయ్యదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. గత యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కంటే మెరుగ్గా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒప్పందాన్ని ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్నామని రాజ్‌నాథ్‌ తెలిపారు. కానీ కొంత మంది నాయకులు పడుకున్నా, నిల్చున్నా రఫేల్‌ డీల్‌ అని కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రాఫెల్‌ ఒప్పందంపై ప్రతిపక్షాలు ఒకే అబద్ధాన్ని వందసార్లు ప్రచారం చేసి  ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శద్ద తీసుకుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news